Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్‌.. ఇప్పుడు భర్త, పిల్లలే లోకమంటోంది

సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఓ స్టార్‌ హీరోను ప్రేమ వివాహం చేసుకుందామె. ఆతర్వాత భర్తే సర్వస్వంగా భావించింది. సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు అమ్మగా మారి వారే లోకంగా జీవితాన్ని గడిపింది. అయితే ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవారు కావడంతో మళ్లీ నటనపై మక్కువ పెంచుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అప్పటికీ ఇప్పటికీ ఆమె అందంలో కానీ, అభినయంలో ఏ మాత్రం తేడా లేదు

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్‌.. ఇప్పుడు భర్త, పిల్లలే లోకమంటోంది
Actress Childhood Photo
Follow us

|

Updated on: Aug 05, 2023 | 7:18 PM

పై ఫొటోలో చేతినిండా ప్రశంసా పత్రాలు, గెలిచిన కప్పులతో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? సినిమాలు రెగ్యులర్‌గా చూసే వాళ్లు తనను చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఆమె తన అల్లరి, అభినయం, అందంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తను సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మనసుల్లో గిలిగింతలు మొదలవుతాయి. అంతలా తన నటనతో ఆకట్టుకుందీ అందాల తార. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఓ స్టార్‌ హీరోను ప్రేమ వివాహం చేసుకుందామె. ఆతర్వాత భర్తే సర్వస్వంగా భావించింది. సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు అమ్మగా మారి వారే లోకంగా జీవితాన్ని గడిపింది. అయితే ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవారు కావడంతో మళ్లీ నటనపై మక్కువ పెంచుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అప్పటికీ ఇప్పటికీ ఆమె అందంలో కానీ, అభినయంలో ఏ మాత్రం తేడా లేదు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఆమె ఎవరో కాదు హా..హా..హాసిని. అదేనండి మన జెనీలియా డిసౌజా. శనివారం (ఆగస్టు 5) తన పుట్టిన రోజు. ఈక్రమంలో తన చిన్ననాటి, అరుదైన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలోనే తెలుగు సినిమా..

2003లో వచ్చిన తుజే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్)తో బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది జెనీలియా. ఆతర్వాత బాయ్స్‌ సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కినేని సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో డైరెక్టుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో తన కెరీర్‌ మలుపుతిరిగింది. అందులో జెన్నీ పోషించిన హాసినీ పాత్ర చాలామందికి ఫేవరెట్. సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, సుభాష్‌ చంద్రబోస్‌, నా ఇష్టం.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఇక 2012లో బాలీవుడ్‌ హీరో రితేశ్ దేశ్ ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. అయితే పిల్లలు కాస్త పెద్ద కావడంతో ఇటీవలే సెకెండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్‌ చేసింది జెనీలియా. తన భర్త రితేష్‌తో కలిసి వేద్‌ (నాగచైతన్య మజిలీ రీమేక్‌) అనే మరాఠి సినిమాలో నటించింది. ఇది సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. త్వరలోనే ఓ ద్వి భాషా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..