Aravind B

Aravind B

Sub-Editor - TV9 Telugu

aravind.baiyya@tv9.com

తెలుగు మీడియా రంగంలో రెండేళ్ల అనుభవం ఉంది. 2021లో ఈటీవీతో తెలుగు మీడియా రంగంలోకి వచ్చాను. 2023 నుంచి ఇప్పటివరకు టీవీ9 తెలుగు (డిజిటల్)లో కొనసాగుతున్నాను.

Tamil Nadu: దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి తిన్న సీఎం స్టాలిన్..

Tamil Nadu: దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి తిన్న సీఎం స్టాలిన్..

చిన్నారులకు అందించే అల్పాహారాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ను వడ్డించారు. అనంతరం ఆ పాఠశాలలోని చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్ అల్పాహారం తిన్నారు. మరోవైపు చైన్నైలోని స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాన్ని స్టాలిన్ సర్కారు ప్రకటించింది.

Hyderabad: హైదరాబాద్‌కు రానున్న మరో రెండు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు..

Hyderabad: హైదరాబాద్‌కు రానున్న మరో రెండు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు..

తెలంగాణ వేదికగా తమ కార్యకలాపాల విస్తరించేందుకు మరో రెండు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా పేరొందిన మెట్‌లైఫ్‌... తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించేందుకు సిద్ధమైంది. అలాగే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడానికి ‘గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఎక్స్ఛేంజ్‌(జీహెచ్‌ఎక్స్‌)’ అనే మరో కార్పొరేట్‌ సంస్థ సైతం తమ ప్లాన్‌ను తెలియజేసింది.

Telangana: మరీ ఇంత దారుణమా.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య చేసిన కొడుకు

Telangana: మరీ ఇంత దారుణమా.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య చేసిన కొడుకు

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, చివరికి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. కుటుంబ కలహాలతో వచ్చే గొడవల వల్ల క్షణికావేశంలో హత్యలు చేసుకునే ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో ఓ కొడుకు కన్న తల్లినే హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై యూకే న్యూస్ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నెటీజన్లు

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై యూకే న్యూస్ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నెటీజన్లు

చంద్రయాన్ - 3 విజయవంతం కావడం వల్ల భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు అసాధ్యామనుకున్న ఈ చంద్రయాను సుసాధ్యం చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలపై అన్ని దేశాలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందమంది బ్రిటన్ జర్నలిస్టులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. చందమామ దక్షిణ ధ్రువంపైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష రంగంలో పురోగతి సాధించినటువంటి రాష్ట్రాలకు బ్రిటన్ ఆర్థికంగా సాయం చేయాల్సిన అవసరం లేదంటూ ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Telangana: వైద్యురాలు లేకపోవండతో బాలింతకు కాన్పు చేసిన నర్సు.. చివరికి ఏం జరిగిందంటే ?

Telangana: వైద్యురాలు లేకపోవండతో బాలింతకు కాన్పు చేసిన నర్సు.. చివరికి ఏం జరిగిందంటే ?

ఈ మధ్య బాలింతలకు కాన్పులు వికటించి తల్లి లేదా బిడ్డ మృతి చెందితున్న సందర్భాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయ్యింది. జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువు మరణించిడం కలకలం రేపింది.

North Korea: ఉత్తర కొరియా చేపట్టిన నిఘా ఉపగ్రహం ప్రయోగం విఫలం.. అయినా తగ్గేదే లే అంటున్న స్పేస్ ఏజెన్సీ

North Korea: ఉత్తర కొరియా చేపట్టిన నిఘా ఉపగ్రహం ప్రయోగం విఫలం.. అయినా తగ్గేదే లే అంటున్న స్పేస్ ఏజెన్సీ

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని చేర్చాలని ఆ దేశం చెపట్టిన ప్రయోగం విఫలమైంది. గురువారం ఉదయం పూట ఉత్తర కొరియా ఈ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అలాగే మూడు నెలల క్రితం మొదటిసారిగా ఉత్తర కొరియా ప్రయోగం చేపట్టింది. అయితే ఇది విఫలం కావడంతో ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు జరిగినటువంటి తాజా ప్రయోగంలో రాకెట్ మూడో దశలో ఫెయిల్ అయినట్లు ఆ దేశ మీడియా సంస్థ తెలిపింది.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు.

Chandrayaan 3: చందమామ వనరులపై హక్కులు ఎవరివి ?.. అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే

Chandrayaan 3: చందమామ వనరులపై హక్కులు ఎవరివి ?.. అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్‌ సురక్షింతగా దిగడంతో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లలేని చంద్రని దక్షిణ ధ్రువంపై కాలుమోపడంతో భారత్ తన ఖ్యాతిని చాటిచెప్పింది. వాస్తవానికి చంద్రునిపైకి వెళ్లేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. కానీ..

Telangana: బీఆర్ఎస్‎తో కటీఫ్.. కాంగ్రెస్ వైపు చూస్తున్న కమ్యూనిస్టు పార్టీలు

Telangana: బీఆర్ఎస్‎తో కటీఫ్.. కాంగ్రెస్ వైపు చూస్తున్న కమ్యూనిస్టు పార్టీలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ 119 నియోజకవర్గాలకు 115 నియోజవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ పార్టీల కోసం అభ్యర్థుల్ని వెతికే పనిలో పడ్డాయి. అయితే గతంలో కమ్యూనిస్టుల వైపు ఉన్న కేసీఆర్ ఇప్పుడు వారికి దూరంగా జరిగారు. దీంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

PM Modi: బ్రిక్స్ వేదికపై జారిపడ్డ జాతీయ జెండా.. ప్రధాని మోదీ చేసిన పనికి ప్రశంసలు

PM Modi: బ్రిక్స్ వేదికపై జారిపడ్డ జాతీయ జెండా.. ప్రధాని మోదీ చేసిన పనికి ప్రశంసలు

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు. ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జోహన్నెస్‌బర్గ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీతో ఫోటో దిగడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆసక్తి చూపాడు. ఇరునేతలు కలిసి... ఫోటో దిగాడానికి బ్రిక్స్ వేదికపైకి వచ్చారు.

Youtube: యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే

Youtube: యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలామంది యూట్యాబ్‌కు మంచి ప్రజాధారణ దక్కింది. వినోదం కోసం, ఏదైన కొత్త సమాచారం తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లోని వీడియోలను ప్రతిరోజూ కోట్లాది మంది వీక్షిస్తున్నారు. అలాగే తమకు ఏదైన సమస్య వచ్చిన కూడా వాటి పరిష్కారం కోసం యూట్యూబ్‌ పైనే ఆధారపడుతున్నారు. అయితే తమిళనాడులో ఓ వ్యక్తి చేసిన ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్ వీడియో చూసి తన భార్యకు ప్రసవం చేయడంతో ఆమె మృతి చెందడం కలకలం రేపింది.

Telangana: గురుకుల పోస్టుల ఫలితాలు వచ్చేది అప్పుడే.. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి

Telangana: గురుకుల పోస్టుల ఫలితాలు వచ్చేది అప్పుడే.. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి ఇటీవల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఫలితాలు ఈ నెలఖరులోగా విడుదలకానున్నాయి. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ రాతపరీక్షలు 23వ తేదీ వరకు సుమారు 19 పనిరోజులు జరిగాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తానికి 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో ప్రతిరోజూ మూడుషిప్లుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామక బోర్డు నిర్వహించింది.