కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అయితే, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు చాలా పేలవంగా ఉంది.


దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అయితే, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు చాలా పేలవంగా ఉంది.

దేశంలోనే అత్యంత పురాతన పార్టీగా కాంగ్రెస్‌ ఘనత సాధించింది. ఈ పార్టీ 28 డిసెంబర్ 1885న స్థాపించబడింది. 72 మంది సంఘ సంస్కర్తలు, పాత్రికేయులు, న్యాయవాదులు బొంబాయి (నేడు ముంబై)లోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్‌కు సమావేశమయ్యారు. క్రమంగా కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకుంది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భాగస్వాములై దేశ విముక్తిలో ముఖ్యపాత్ర పోషించారు.

స్వాతంత్ర్యం తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పండిట్ నెహ్రూ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. 1964లో మరణించే వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు. లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండవ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ దేశానికి మూడవ, మొదటి మహిళా ప్రధాన మంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఆమె హత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ 1991 ఎన్నికల ప్రచారంలో శ్రీలంక ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురయ్యారు.

దేశంలోనే అత్యధిక మంది ప్రధాన మంత్రులను తయారు చేసిన ఘనత కాంగ్రెస్‌దే. 1990 తర్వాత ఆ పార్టీ నుంచి పివి నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లు ప్రధానమంత్రులు అయ్యారు. మన్మోహన్ సింగ్ వరుసగా పదేళ్లు ప్రధానిగా కొనసాగారు.అత్యధిక కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గత పదేళ్లుగా పతనమవుతూ వస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 44 సీట్లకు పరిమితమయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ  కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా అమేథీ స్థానం నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన పలు హామీలు

పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 5న తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి మించి పెంచుతామని, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధమైన హామీని అందిస్తామని, ఎలక్టోరల్ బాండ్‌లు, రాఫెల్ డీల్, పెగాసస్ వంటి కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది. 

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలేంటి?

దేశంలో కుల ఆధారిత జనాభా గణన నిర్వహించబడుతుంది. రిజర్వేషన్ గరిష్ట పరిమితిని 50 శాతం పైకి పెంచబడుతుంది.

జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించబడుతుంది. 

'అగ్నీపథ్' పథకం రద్దు చేయబడుతుంది. సాయుధ దళాలకు సాధారణ నియామక ప్రక్రియ పునరుద్ధరించబడుతుంది. అలాగే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 33 శాతం పోస్టుల్లో మహిళలు నియమించబడుతారు.

9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ మొబైల్‌ ఫోన్లు ఉచితంగా అందజేస్తామన్నారు.

రక్షణ దళాలకు 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' (OROP) సక్రమంగా అమలు చేయబడుతుంది. 

ఎలక్టోరల్ బాండ్‌లు, రాఫెల్, పెగాసస్ స్పైవేర్ వంటి అవినీతి కేసులను విచారణ జరిపించడబడుతుంది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అన్ని వర్గాల పేదలకు ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేయబడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నూతన విద్యా విధానం సవరించబడుతుంది.

అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరిన నేతలపై కొనసాగుతున్న కేసులను తిరిగి తెరిచి విచారణ జరిపించబడుతుంది.

ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టుతో సంప్రదించి జాతీయ న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయబడుతుంది.

వచ్చే పదేళ్లలో భారత జీడీపీని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

'యువ న్యాయం' కింద ఐదు హామీలు ఇచ్చారు. ఇందులో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం

'కిసాన్ న్యాయ్' కింద ఎంఎస్‌పికి చట్టపరమైన హోదా, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, జిఎస్‌టి రహిత వ్యవసాయానికి అవకాశం కల్పించబడుతుంది.  

'కార్మిక న్యాయం' కింద కార్మికులకు ఆరోగ్య హక్కు కల్పిస్తామని, రోజుకు రూ.400 కనీస వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. 

'నారీ న్యాయం' కింద 'మహాలక్ష్మి' పథకం ద్వారా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయానికి సంబంధించి హామీ ఇచ్చారు.

భారతదేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు (India's Major Political Parties)
Party Name Leads + Result Party Logo Party President Party Establishment Year
Bharatiya Janata Party JP Nadda April 1980
Indian National Congress Mallikarjun Kharge December 1885
Aam Aadmi Party Arvind Kejriwal November 2012
Bahujan Samaj Party Mayawati April 1984
Communist Party of India (Marxist-Leninist) Sitaram Yechury November 1964
All India Majlis-E-Ittehadul Muslimeen Asaduddin Owaisi November 1927
Bharat Rashtra Samithi K. Chandrashekar Rao April 2001
Telugu Desam N. Chandrababu Naidu March 1982
Yuvajana Sramika Rythu Congress Party YS Jagan Mohan Reddy March 2011

ఎన్నికల వీడియో