లోక్‌సభ ఎన్నికల రాజకీయ పార్టీల ఫలితాలు

దేశ స్వాతంత్య్రానంతరం 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 14 కాగా.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 6కి తగ్గింది.

National Party (జాతీయ పార్టీ)

దేశ స్వాతంత్య్రానంతరం 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 14 కాగా.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 6కి తగ్గింది. వీటిలో కాంగ్రెస్, సీపీఐ రెండు పార్టీలు మాత్రమే ఇప్పటివరకు జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి.


2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో 6 రాజకీయ పార్టీలకు జాతీయ పార్టీ హోదా ఉంది. ఈ పార్టీలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). ఇందులో బీఎస్పీ మినహా అన్ని పార్టీలు ఏదో ఒక కూటమిలో భాగంగా ఉన్నాయి. 2023లో ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. 

రాజకీయ పార్టీలకు జాతీయ లేదా రాష్ట్ర స్థాయి పార్టీ హోదా కల్పించేందుకు ఎన్నికల సంఘం 1968నాటి నియమాలను అనుసరిస్తుంది. దీని ప్రకారం, జాతీయ పార్టీ హోదా పొందడానికి ఏదైనా పార్టీ లోక్‌సభ ఎన్నికలు లేదా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. 

అలాగే ఆ పార్టీకి చెందిన కనీసం నలుగురు అభ్యర్థులు ఏదైనా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపీలుగా ఎన్నికై ఉండాలి. లేదా ఆ పార్టీకి కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అనే హోదా ఉండాలి. లేదా లోక్‌సభలో ఆ పార్టీ మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లు గెలుచుకోవాలి. అలాగే, దాని అభ్యర్థులు 3 రాష్ట్రాల్లో గెలిచి ఉండాలి.

Party Name Leads + Result Party Logo Party President Party Establishment Year
Bharatiya Janata Party JP Nadda April 1980
Indian National Congress Mallikarjun Kharge December 1885
Aam Aadmi Party Arvind Kejriwal November 2012
Bahujan Samaj Party Mayawati April 1984
Communist Party of India (Marxist-Leninist) Sitaram Yechury November 1964
Regional Party (ప్రాంతీయ పార్టీ)

ఏ ఎన్నికల్లోనైనా రాజకీయ పార్టీల పాత్ర చాలా కీలకం. చాలా ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుంది. అయితే చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీ. భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో అత్యధిక సార్లు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఘనత ఆ పార్టీ సొంతం. 

2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-ఎం(సీపీఎం), తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) పోటీ చేశాయి. మొత్తం 7 జాతీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ 7 జాతీయ పార్టీలు మొత్తం 1,454 మంది అభ్యర్థులను నిలబెట్టగా.. అందులో 397 మంది మాత్రమే విజయం సాధించారు. 670 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 6 జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (INC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-ఎం (CPM), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఉన్నాయి. ఇందులో బీఎస్పీ మినహా అన్ని పార్టీలు ఏదో ఒక కూటమిలో భాగంగా ఉన్నాయి. 2023లో ఆప్‌కు జాతీయ పార్టీ హోదా దక్కింది. 

తొలి ఎన్నికల్లో ఎన్ని జాతీయ పార్టీలు

దేశంలో 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో సహా 14 జాతీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 499 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 364 సీట్లు గెలుచుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ 16 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సోషలిస్టు పార్టీ 12 సీట్లు సాధించి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  

దేశ పార్లమెంటరీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఘనత కూడా కాంగ్రెస్‌కు ఉంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 415 స్థానాల్లో గెలుపొందగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం 34 స్థానాల్లో పోటీ చేసి 30 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఐ 22 సీట్లు గెలుచుకుంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఖాతా తెరిచింది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. ఈ స్థానాల్లో ఒకదానిలో ఆంధ్రప్రదేశ్‌లోని హన్మకొండ పార్లమెంటు స్థానంలో బిజెపి పివి నరసింహారావును ఓడించింది. కాంగ్రెస్ తన చరిత్రలో అతిపెద్ద విజయం సాధించినప్పుడు ఈ ఓటమి వచ్చింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో 600కు పైగా రాజకీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కానీ కొన్ని పార్టీలు మాత్రమే గెలిచాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ పార్టీల సంఖ్య 7. ఇందులో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 303 సీట్లు గెలుచుకోగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కనీసం 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జాతీయ పార్టీల అభ్యర్థులు 1454 మంది బరిలో నిలవగా, అందులో 670 మంది అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్లు దక్కడం విశేషం.

Party Name Leads + Result Party Logo Party President Party Establishment Year
All India Majlis-E-Ittehadul Muslimeen ఏఐఎంఐఎం  పార్టీ  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు Asaduddin Owaisi November 1927
Bharat Rashtra Samithi భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు K. Chandrashekar Rao April 2001
Telugu Desam తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు N. Chandrababu Naidu March 1982
Yuvajana Sramika Rythu Congress Party వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు YS Jagan Mohan Reddy March 2011

ఏ పార్టీకైనా జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది. అయితే ఇందుకోసం రాజకీయ పార్టీలు కూడా అనేక ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. జాతీయ పార్టీలకు చాలా భిన్నమైన నియమాలు ఉన్నాయి, అయితే రాష్ట్ర స్థాయి పార్టీ హోదా సాధించడానికి, కొన్ని షరతులు నెరవేర్చాలి. దిగువ పేర్కొన్న షరతుల్లో ఏదైనా ఒకటి నెరవేరినట్లయితే, అది రాష్ట్ర పార్టీ హోదాను పొందుతుంది.

రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందడానికి, ఒక రాజకీయ పార్టీ సంబంధిత రాష్ట్రంలో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6 శాతం పొందాలి. అలాగే, అదే రాష్ట్ర అసెంబ్లీలో కనీసం 2 సీట్లు గెలవడం తప్పనిసరి. 

లేదా ఒక పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సంబంధిత రాష్ట్రంలో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6 శాతం పొంది, ఆ రాష్ట్రం నుంచి కనీసం ఒక లోక్‌సభ సీటును గెలిచి ఉండాలి. 

లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 3% సీట్లు గెలవాలి లేదా అసెంబ్లీలో 3 సీట్లు (ఏది ఎక్కువైతే అది) ఆ పార్టీ గెలుచుకోవాలి.

లేదా పార్లమెంటరీ ఎన్నికలలో రాష్ట్రానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి కేటాయించిన ప్రతి 25 స్థానాలకు సంబంధిత రాష్ట్రం లోక్‌సభలో ఒక సీటును గెలుచుకోవాలి. 

లేదా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సదరు పార్టీ 8 శాతం ఓట్లు సాధించాలి.

ఎన్నికల వీడియో