Water Metro: ఏసీ, వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్‌ మెట్రో.. ఫొటోలు చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే..

అచ్చం మెట్రో రైలు తరహాలోనే.. కళ్లు జిగేల్ అనేలా వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది. ఏసీ, ఫ్రీ వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్‌ మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. రేపటినుంచి కొచ్చిలో అందుబాటులో రానున్న వాటర్‌ మెట్రో ఎలా పనిచేస్తుంది.. అసలు ఈ మెట్రో ఉద్దేశ్యం ఏంటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

|

Updated on: Apr 24, 2023 | 9:48 AM

అచ్చం మెట్రో రైలు తరహాలోనే.. కళ్లు జిగేల్ అనేలా వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది. ఏసీ, ఫ్రీ వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్‌ మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. రేపటినుంచి కొచ్చిలో అందుబాటులో రానున్న వాటర్‌ మెట్రో ఎలా పనిచేస్తుంది.. అసలు ఈ మెట్రో ఉద్దేశ్యం ఏంటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

అచ్చం మెట్రో రైలు తరహాలోనే.. కళ్లు జిగేల్ అనేలా వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది. ఏసీ, ఫ్రీ వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్‌ మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. రేపటినుంచి కొచ్చిలో అందుబాటులో రానున్న వాటర్‌ మెట్రో ఎలా పనిచేస్తుంది.. అసలు ఈ మెట్రో ఉద్దేశ్యం ఏంటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

1 / 7
మెట్రో రైలు అనగానే పట్టాలపై పరుగులు పెట్టే రైళ్లను మాత్రమే చూశాం.. కానీ ఇప్పడు తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి రానుంది. కొచీలో వాటర్‌ మెట్రో అందుబాటులోకి రానుంది. వాటర్‌ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వాటర్‌ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు.

మెట్రో రైలు అనగానే పట్టాలపై పరుగులు పెట్టే రైళ్లను మాత్రమే చూశాం.. కానీ ఇప్పడు తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి రానుంది. కొచీలో వాటర్‌ మెట్రో అందుబాటులోకి రానుంది. వాటర్‌ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వాటర్‌ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు.

2 / 7
ఆర్థిక వృద్ధి, పర్యాటకం, రవాణా కనెక్టివిటీని పెంపొందించేలా ఈ వాటర్ మెట్రో సేవలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి "వాటర్ మెట్రో" సేవలను ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో ప్రారంభించనున్నారు.

ఆర్థిక వృద్ధి, పర్యాటకం, రవాణా కనెక్టివిటీని పెంపొందించేలా ఈ వాటర్ మెట్రో సేవలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి "వాటర్ మెట్రో" సేవలను ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో ప్రారంభించనున్నారు.

3 / 7
దేశంలో దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్‌ చెబుతున్నారు. కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌గా వర్ణించారు. కోచి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు.

దేశంలో దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్‌ చెబుతున్నారు. కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌గా వర్ణించారు. కోచి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు.

4 / 7
కోచ్చి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను  కలుపుతూ ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను 1136 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళ ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం అందిస్తున్నారు.

కోచ్చి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను 1136 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళ ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం అందిస్తున్నారు.

5 / 7
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి.  కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో టికెట్‌ ప్రారంభ ధర 20 కాగా, గరిష్ఠ టికెట్‌ ఖరీదు 40 రూపాయలు.

ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో టికెట్‌ ప్రారంభ ధర 20 కాగా, గరిష్ఠ టికెట్‌ ఖరీదు 40 రూపాయలు.

6 / 7
టికెట్లతోపాటు పాస్‌ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్‌ ఖరీదు 180, నెల వారీ పాస్‌ ధర  600, మూడు నెలల పాస్‌ ఖరీదు 1500గా నిర్ణయించారు.

టికెట్లతోపాటు పాస్‌ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్‌ ఖరీదు 180, నెల వారీ పాస్‌ ధర 600, మూడు నెలల పాస్‌ ఖరీదు 1500గా నిర్ణయించారు.

7 / 7
Follow us
Most Read Stories