Chandrayaan 3: బాలివుడ్ సినిమా ఖర్చు ఈ ప్రాజెక్టు ఖర్చు ఒకటే అంటే నమ్ముతారా.. ఆశ్చర్యపరిచిన మాజీ ఛైర్మన్ ప్రకటన

భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ దాని పనిలో నిమగ్నమై ఉంది. భారతదేశాన్ని ఇంతటి చారిత్రాత్మకమైన ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలకు అందరూ సలాం చేస్తున్నారు. అయితే ఈ ఇస్రో సైంటిస్టుల జీతం ఎంతో తెలుసా.. ఇస్రోలో పనిచేస్తున్న వారి కంటే నాసా సైంటిస్టులు ఎక్కువ సంపాదిస్తున్నారా..? ఈ సత్యాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి. మాధవన్ నాయర్ అందరి ముందుకు తీసుకురావడంతో అంతా షాకయ్యారు.

Chandrayaan 3: బాలివుడ్ సినిమా ఖర్చు ఈ ప్రాజెక్టు ఖర్చు ఒకటే అంటే నమ్ముతారా.. ఆశ్చర్యపరిచిన మాజీ ఛైర్మన్ ప్రకటన
Madhavan Nair Reveals Chandrayaan Project
Follow us

|

Updated on: Aug 24, 2023 | 7:10 PM

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత చంద్రునిపై నడుస్తోంది. ఇప్పుడు డేటా కూడా త్వరలో రావడం ప్రారంభమవుతుంది. భారతదేశానికి ఈ విజయాన్ని అందించిన శాస్త్రవేత్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారు అహర్నిశలు తపించారు.. శ్రమించారు.. ఈ విజయం కోసం తపస్సు చేశారు. వారి కృషి ఫలించింది. అనుకున్నట్లుగానే దేశం పేరును నిలబెట్టారు. అయితే, వారి జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయా.. అసలు ఓ బాలివుడ్ సినిమా ఖర్చు ఈ ప్రాజెక్టు ఖర్చు ఒకటే అంటే నమ్ముతారా.. అవును ఇది నిజం.

భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ దాని పనిలో నిమగ్నమై ఉంది. భారతదేశాన్ని ఇంతటి చారిత్రాత్మకమైన ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలకు అందరూ సలాం చేస్తున్నారు. అయితే ఈ ఇస్రో సైంటిస్టుల జీతం ఎంతో తెలుసా.. ఇస్రోలో పనిచేస్తున్న వారి కంటే నాసా సైంటిస్టులు ఎక్కువ సంపాదిస్తున్నారా..? ఈ సత్యాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి. మాధవన్ నాయర్ అందరి ముందుకు తీసుకురావడంతో అంతా షాకయ్యారు. అవును. నేడు చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇస్రో శాస్త్రవేత్తల జీతం ఐదు రెట్లు తక్కువగా ఉన్నందున ఇది జరిగిందని మాధవన్ నాయర్ అన్నారు. తక్కువ డబ్బుతో ప్రతి మిషన్‌ను పరిష్కరించాలని మనం ఆలోచించడానికి శాస్త్రవేత్తలకు తక్కువ జీతం కూడా ఒక కారణమని ఆయన అన్నారు.  నేడు, ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో అంతరిక్ష కేంద్రాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల కంటే చాలా తక్కువ జీతం పొందుతున్నారు.

మీకు ఇక్కడ కోటీశ్వరులు దొరకరని.. అందరూ సాదాసీదాగా జీవిస్తున్నారని.. డబ్బు గురించి ఎవరూ ఆందోళన చెందరని, ప్రతి ఒక్కరూ దేశానికి తమవంతు సహకారం అందించాలని ఇస్రో మాజీ ఛైర్మన్ అంటున్నారు. మేము మా తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మేము మా మిషన్‌లో స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తున్నాం. దీని కారణంగా బడ్జెట్‌ను నియంత్రించడంలో విజయం సాధిస్తాం.

చంద్రయాన్-3 ద్వారా భారతదేశం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మిషన్ మొత్తం బడ్జెట్ 615 కోట్లు, నేటి కాలంలో చాలా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల బడ్జెట్ ఇంతే. ఇదిలావుండగా భారత్ చరిత్ర సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నేడు భారత్ అవతరించింది. కాగా, దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం 6:40 గంటలకు చంద్రునిపై అడుగు పెట్టింది.

(ఇన్‌పుట్: PTI)

మరిన్ని జాతీయ వార్తల కోసం