హైదరాబాద్లో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గమ్యస్థానానికి సకాలంలో వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసం కొత్త కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనికోసం స్ట్రాటజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)కి శ్రీకారం చుట్టారు.