M Sivakumar

M Sivakumar

Reporter - TV9 Telugu

siva.medandraravu@tv9.com
Varalakshmi Vratam At Indrakeeladri: నేడు మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. పంచహారతుల సేవ, పల్లకీ సేవకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా..

Varalakshmi Vratam At Indrakeeladri: నేడు మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. పంచహారతుల సేవ, పల్లకీ సేవకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా..

దుర్గమ్మ ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక పూజల కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. దీంతో ఇప్పటికే ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంజినీరింగ్, పరిపాలనా విభాగాల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా విధులు కేటాయించారు. క్యూలైన్లో భక్తుల కోసం కూలర్ల ఏర్పాటు, మంచినీటి పంపిణీకి క్యాన్లు సిద్ధం చేస్తున్నారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగ అవకాశాలు..

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగ అవకాశాలు..

విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కారాగారంలో ఖాళీగా ఉన్న మేల్ నర్సింగ్, డ్రైవర్, ఎలక్ట్రీషీయన్‌ , స్వీపర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేయాలన్నారు.

Andhra Pradesh:పెళ్లి పేరుతో టోకరా.. నకిలీ ప్రొఫైల్స్‌తో అందినకాడికి దోపిడీ.. ఎలా చేశాడో తెలుసా..

Andhra Pradesh:పెళ్లి పేరుతో టోకరా.. నకిలీ ప్రొఫైల్స్‌తో అందినకాడికి దోపిడీ.. ఎలా చేశాడో తెలుసా..

Vijayawada News: పెళ్లంటే... నూరేళ్ల పంట అని పెద్దలు చెపుతారు.. జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఇటీవల కాలంలో పెళ్లి పేరుతో కొందరు మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటివి నగరంలో వెలుగు చూస్తున్నాయి. బోగస్ ప్రొఫైల్స్ సృష్టించి, ఇతరుల ఫొటోలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాలలో పనిచేస్తున్నా.. ఎంఎన్సీలో ఉద్యోగం.. అంటూ రకరకాల పేర్లతో ఎదుటి వారిని నమ్మిస్తున్నారు.. ఆనక వివిధ అవసరాల పేర్లతో అందినకాడికి డబ్బు లాగేస్తున్నారు. మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేస్తున్నారు. అవతలి వారు తెలుసుకునేసరికి అంతా అయిపోతోంది. డబ్బులు పోగొట్టుకుని.. చేసేది లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్

Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్న మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడితే.. సందర్శకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో పాటు ఏపీకే తలమానికంగా నిలుస్తుందంటున్నారు అధికారులు. ప్రధాన అటవీ సంరక్షణ అధికారి మధుసూదనరెడ్డి కృషితో పాటు ఎన్టీటీపీఎస్ సంస్థ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Vijayawada: తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గ గుడి మాస్టర్ ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..

Vijayawada: తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గ గుడి మాస్టర్ ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..

Vijayawada: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతోన్న 70 కోట్ల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, సంబంధిత పనుల రూపకల్పన కోసం ఆర్ కొండలరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ బృందం ఆదివారం ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తదితర పనుల గురించి టెక్నికల్ కమిటీ బృందానికి పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు టెక్నికల్ బృందం కొన్ని సూచనలు, సలహాలు..

Indian Sonneteer: రెండో సారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు తేజం.. ఠాగూర్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..

Indian Sonneteer: రెండో సారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు తేజం.. ఠాగూర్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..

వెంకట్ పూలబాల అనే వ్యక్తి గతంలో 'భారతవర్ష' అనే పుస్తకాన్ని ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అన్ని సుమారు రెండు లక్షలకు పైగా తెలుగు పదాలతో,1265 పేజీలతో కూడిన పుస్తకం కేవలం 8 నెలల్లో రాశాడు. ఈ ఘనతకు గానూ భారతవర్ష పుస్తకం ప్రపంచ రికార్డను సాధించింది. అదే విధంగా పూలబాల వెంకట్ తాజాగా రాసిన ఇండియన్ సోనేటరీ అనే ఆంగ్ల పద్య పుస్తకం వెంకట్ పూలబాల గారికి రెండవసారి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Andhra Pradesh: ‘మేకుల బాబా’.. వీడు మామూలోడు కాదు.. నాలుగు దిక్కుల్లో మేకులు కొడతాడు.. సీన్ కట్ చేస్తే..

Andhra Pradesh: ‘మేకుల బాబా’.. వీడు మామూలోడు కాదు.. నాలుగు దిక్కుల్లో మేకులు కొడతాడు.. సీన్ కట్ చేస్తే..

నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకుల బాబా అంటే.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రవాణా శాఖలో సరికొత్త మార్పుకు నాంది.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లే..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రవాణా శాఖలో సరికొత్త మార్పుకు నాంది.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లే..

Andhra Pradesh: ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. అయితే, ఇప్పుడు తాజాగా, రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, డిజిటల్‌ ఆర్‌సీ కార్డులు జారీ విధానం మరింత సులభతరం కాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1500కు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.

Krishna District: నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచని ఎమ్మార్వో కార్యాలయం.. కారణం ఏమిటంటే..?..

Krishna District: నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచని ఎమ్మార్వో కార్యాలయం.. కారణం ఏమిటంటే..?..

Krishna District: కృష్ణ జిల్లా అవనిగడ్డలో నిర్మాణం పూర్తి చేస్తున్న తహశీల్దార్ కార్యాలయం నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా అవనిగడ్డలో 1912న బ్రిటిష్ పాలనా సమయంలో తాహసీల్దార్ కార్యాలయం నిర్మించారు.. 110 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ పనుల..

APSRTC Jobs: ఏపీఎస్‌ ఆర్టీసీలో మరోమారు కారుణ్య నియామకాలు..1538 పోస్టుల భర్తీకి సర్కార్‌ అనుమతి..

APSRTC Jobs: ఏపీఎస్‌ ఆర్టీసీలో మరోమారు కారుణ్య నియామకాలు..1538 పోస్టుల భర్తీకి సర్కార్‌ అనుమతి..

2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. వారి కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు..

AP Weather: ఆగస్టు వచ్చినా ఏపీలో మండుతున్న ఎండలు.. కారణమిదే అంటోన్న వాతావారణ శాఖ.. వివరాలివే..

AP Weather: ఆగస్టు వచ్చినా ఏపీలో మండుతున్న ఎండలు.. కారణమిదే అంటోన్న వాతావారణ శాఖ.. వివరాలివే..

Andhra Pradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. పది రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు కురువాల్సింది పోయి.. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం విచిత్రంగా ఉందంటున్నారు. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.. ఎండలు ఇలా మండిపోవడానికి కారణాలను వెల్లడించింది.

కృష్ణా జిల్లా యువ రైతుకు జాతీయ అవార్డు.. ‘వరి సేద్యం’ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి..

కృష్ణా జిల్లా యువ రైతుకు జాతీయ అవార్డు.. ‘వరి సేద్యం’ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి..

Krishna District: పురాతన ధాన్యం సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో రఘు వీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం వైపు వచ్చాడు. ఈ క్రమంలోనే 257 రకాల పురాతన వరి వంగడాలను సేకరించి వాటిని తన పొలంలో సాగు చేస్తూ సంరక్షిస్తున్నారు. రఘు వీర్ కృషిని గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని అథారిటీ జాతీయ మొక్కల జన్యు రక్షకుని అవార్డును న్యూఢిల్లీలో శనివారం..