Telangana: తెలంగాణలో రూటు మార్చుతోన్న బీజేపీ.. సైలెంట్గా ఇన్సైడ్ వర్క్ చేస్తోన్న కమలనాథులు..
తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ హడావుడి చేస్తుండగా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా ఇన్సైడ్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. రిజర్వుడ్ స్థానాలపై గురి పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ దూకుడు పెంచేలా ఇప్పటికే సమన్వయ కమిటీలు వేసింది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలను కలిసేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని నిర్ణయించి.. ఆ దిశగా పయనిస్తోంది. తాజాగా..
తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్ చేయాలని భావిస్తోంది బీజేపీ. అధిష్టానం సూచనలతోపాటు.. లోకల్ పరిస్థితులకు అనుగుణంగా స్టైల్ మార్చుతోంది. బీఆర్ఎస్ సర్కార్పై మలిదశ ఉద్యమం పేరుతో పోరాటం చేయాలని డిసైడ్ అయింది తెలంగాణ బీజేపీ. అదే సమయంలో రిజర్వుడ్ స్థానాలపై మరింత ఫోకస్ పెంచుతోంది. ఇంతకీ.. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతోంది?.. బీజేపీ మలిదశ పోరాటం లక్ష్యమేంటి?..
తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ హడావుడి చేస్తుండగా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా ఇన్సైడ్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. రిజర్వుడ్ స్థానాలపై గురి పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ దూకుడు పెంచేలా ఇప్పటికే సమన్వయ కమిటీలు వేసింది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలను కలిసేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని నిర్ణయించి.. ఆ దిశగా పయనిస్తోంది. తాజాగా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించింది తెలంగాణ బీజేపీ. ఈ కార్యక్రమంలో.. బీజేపీ అగ్రనేత సునీల్ బన్సాలీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ ప్రభుత్వం మండిపడ్డారు కిషన్రెడ్డి.
కేసీఆర్ సర్కార్పై బీజేపీ మలిదశ ఉద్యమం చేస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ఈ సారి డకవుట్ ఖాయమని సొంత సర్వేల్లో తేలడంతోనే కేసీఆర్ ఫ్రస్టేట్ అవుతున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. మొత్తంగా.. తెలంగాణలో బీజేపీ స్ట్రాటజిక్గా ముందుకెళ్తోంది. రిజర్వుడ్ స్థానాలపై దృష్టి సారించి.. వాటిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో ఇంకెలాంటి ప్లాన్స్ అమలు చేస్తుందో చూడాలి.
తెలంగాణ సర్కార్పై కిషన్ రెడ్డి విమర్శలు..
సాధించుకున్న తెలంగాణ… కల్వకుంట్ల కుటుంబ పాలనలో ఆగమైంది. ప్రజలు, రైతులు, నిరుద్యోగుల జీవితాల్లో బిజెపి వెలుగులు నింపుతుంది. – @kishanreddybjp గారు, కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. pic.twitter.com/PBQZxoyIF7
— BJP Telangana (@BJP4Telangana) August 23, 2023
ఎల్బీనగర్లో బీజేపీ నాయకుల ధర్నా..
బెల్ట్ షాప్ రహిత, గంజాయి రహిత ఎల్బీ నగర్ కోసం 48 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టిన బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు.
ఈ సందర్భంగా ఎల్ బీ నగర్ నియోజకవర్గం నందనవనం లో మైనర్ దళిత బాలిక పై సామూహిక అత్యాచారం చేసిన వాళ్లను కఠినంగా శిక్షంచాలని మరియు… pic.twitter.com/PeZg15ektw
— BJP Telangana (@BJP4Telangana) August 23, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..