SIM Cards: కొత్త సిమ్ కార్డు కొంటున్నారా? ఇలా చేశారంటే జైలు శిక్ష తప్పదు.. రూల్స్ మారాయ్
దేశంలో సైబర్ క్రైమ్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గంప గుత్తగా ఎక్కువ సిమ్ కార్డులు ఒకేసారి కొనడాన్ని కేంద్రం నిషేధించింది. డిజిటల్ మోసాల నివారణకు సిమ్ కార్డులను విక్రయించే డీలర్లకు ప్రభుత్వం పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. దీంతో సిమ్ డీలర్లు ఇకపై ఇష్టానుసారంగా ఎవరికిపడితే వాళ్లకు సిమ్లను అమ్మలేరన్నమాట.ఈ మేరకు సిమ్ కార్డ్ విక్రయించే డీలర్లు, కస్టమర్లకు KYC నియమాలను పాటించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం (ఆగస్టు 17) కొత్త రూల్స్ జారీ చేశారు..
Most Read Stories