Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మరోసారి పెరిగాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price
Follow us

|

Updated on: Aug 14, 2023 | 6:46 AM

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే చాలా మంది బంగారం, వెండి ధరల మీద దృష్టిపెడుతుంటారు. సాధారణంగా.. పెళ్లిళ్లు జరిగినా, ఏమైనా శుభకార్యాలు ఉన్నా.. పండుగలైనా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మరోసారి పెరిగాయి. దేశీయంగా సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 గా ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,620 గా ఉంది. కాగా.. కిలో వెండి ధర రూ.3,200 మేర పెరిగి.. రూ.76,200 లుగా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,800 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,760 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర ర.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620గా ఉంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,620 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,620 లుగా ఉంది.

వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,200, చెన్నైలో రూ.76,200, బెంగళూరులో రూ.76,200 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000లుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.76,200, విశాఖపట్నంలో రూ.76,200, విజయవాడలో రూ.76,200 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు.. కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..