Hyderabad: హెచ్ఎండీఏ భూముల వేలానికి విశేష స్పందన లభిస్తోంది. నగరశివారుల్లో డెవలప్ చేసిన ప్లాట్లను ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తోంది హెచ్ఎండీఏ. కోకాపేట్, బుద్వేల్, మోకిల, షాబాద్ ప్లాట్ల వేలంతో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరింది. దీంతో అదే జోష్ తో మోకిలలో ఫేజ్-2 వేలానికి సర్కారు సిద్ధమైంది. ప్రీబిడ్డింగ్ మీటింగ్ కు బిడ్డర్లు పెద్దఎత్తున హాజరయ్యారు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలలో ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ కు దగ్గర కావడం, మోకిల వైపు ఎక్కువ విల్లాలు ఉండటంతో భూములు ధరలు భారీగా..