Rajesh Sharma

Rajesh Sharma

Author - TV9 Telugu

raaj.shetpally@tv9.com

26 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్ళు. ఆ తర్వాత 1999 జనవరి మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా మొదలైన జర్నలిజం జర్నీలో జెమిని, తేజ, మాటీవీ, ఎస్వీబీసీ, టీవీ5, 6టీవీలలో పని చేసి.. ప్రస్తుతం టీవీ9లో 2015 నుంచి సీనియర్ లెవెల్‌లో విధినిర్వహణ. డిజిటల్ విభాగంలో ఏడాదిన్నరగా కంటెంట్ ఎడిటర్‌గా విధి నిర్వహణ.

Read More
Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?

Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. పశ్చిమ, నైరుతీ హైదరాబాద్ నగర శివార్లు ఐటీ సంస్థల ఏర్పాటుతో న్యూయార్క్ వంటి సిటీలను తలపించేలా అభివృద్ధి చెందింది. పదుల సంఖ్యలో నిర్మాణమైన ఫ్లై ఓవర్లతో మాధాపూర్, మైండ్ స్పేస్, కొండాపూర్; గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రామ్‌గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొల్లూరు, వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి, నార్సింగి వంటి ప్రాంతాల రూపురేఖలు గత తొమ్మిదేళ్ళలో సమూలంగా మారిపోయాయి.

Telangana Elections: సొంత నివేదికలు.. సర్వే రిపోర్టులు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

Telangana Elections: సొంత నివేదికలు.. సర్వే రిపోర్టులు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితాలను విడుదల చేయాలని తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలు రెడీ అవుతున్నారు. ఇందుకు పార్టీలో అంతర్గతంగా బేరీజు వేసుకునే ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రైవేటు సర్వేలను నమ్ముకుంటున్నారు. వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల జాబితాను సిద్దం చేస్తున్న ప్రధాన పార్టీలు వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీలో కొత్త జోష్.. ఉత్సాహంగా పార్లమెంటుకు.. మలి విడత భారత్ జోడో యాత్రకు ప్లాన్

Rahul Gandhi: రాహుల్ గాంధీలో కొత్త జోష్.. ఉత్సాహంగా పార్లమెంటుకు.. మలి విడత భారత్ జోడో యాత్రకు ప్లాన్

భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. జోడో యాత్ర తర్వాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే దక్కుతుందన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. దేశంలో రాజకీయాలను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా...

Assembly Elections: ముందుగానే అభ్యర్థుల ఖరారు.. మూడు పార్టీల్లో ముమ్మరంగా కసరత్తు.. సర్వేలు, ఏకాభిప్రాయాలే కీలకం

Assembly Elections: ముందుగానే అభ్యర్థుల ఖరారు.. మూడు పార్టీల్లో ముమ్మరంగా కసరత్తు.. సర్వేలు, ఏకాభిప్రాయాలే కీలకం

నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ రెండో వారం మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఇంకా మూడు నెలల గడువు వుంది. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా మూడు పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితిని ఢీ కొనేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతున్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు తన దగ్గర ఇంకా ఎన్నో అస్త్రాలున్నాయని తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు...

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానం తిరుగులేని ఆయుధం.. కానీ మన దేశంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే?

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానం తిరుగులేని ఆయుధం.. కానీ మన దేశంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే?

తాజాగా మరోసారి పార్లమెంటు ముందుకు అవిశ్వాస తీర్మానం వచ్చింది. జులై ఆఖరు వారంలోనే కాంగ్రెస్ ఎంపీ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే, నాలుగైదు రోజుల తర్జనభర్జన తర్వాత దీనిపై మూడు రోజుల పాటు చర్చకు పెట్టాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. దాంతోపాటు ఆగస్టు 8, 9, 10 తేదీలలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతోంది. రెండ్రోజుల పాటు చర్చించిన...

Manipur Violence: రగులుతున్న మణిపూర్.. పార్లమెంటులో రభస.. ఏ నిబంధనతో ఏంటి ? ఎందుకీ ప్రతిష్టంభన?

Manipur Violence: రగులుతున్న మణిపూర్.. పార్లమెంటులో రభస.. ఏ నిబంధనతో ఏంటి ? ఎందుకీ ప్రతిష్టంభన?

మే 4నే మహిళలపై అకృత్యం జరిగినప్పటికీ రెండున్నర నెలల తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ కావడంతో దేశం భగ్గుమంది. అన్ని వర్గాల వారు మణిపూర్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే, మే 3,4 తేదీలలో...

Telugu Chief Ministers: ఎన్నికల దిశగా తెలుగు ముఖ్యమంత్రుల అడుగులు వేగం.. కీలక నిర్ణయాలు.. వ్యూహరచనలు.. రంజుగా రాజకీయం

Telugu Chief Ministers: ఎన్నికల దిశగా తెలుగు ముఖ్యమంత్రుల అడుగులు వేగం.. కీలక నిర్ణయాలు.. వ్యూహరచనలు.. రంజుగా రాజకీయం

అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా అధికార పార్టీల దూకుడు చూస్తుంటే కొన్ని నెలల ముందే ఎన్నికలకు అధికార పార్టీలు సమాయత్తమవుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి సహజంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయనుకోవచ్చు.

Indo-Chinese Relation: సామరస్య ప్రకటనలొకవైపు.. ఆధిపత్య పోరు ఇంకోవైపు.. అయితేనేం బోర్డర్ వివాదమే కీలకం

Indo-Chinese Relation: సామరస్య ప్రకటనలొకవైపు.. ఆధిపత్య పోరు ఇంకోవైపు.. అయితేనేం బోర్డర్ వివాదమే కీలకం

వాస్తవాధీన రేఖ మొదలుకొని చాలా అంశాలలో చైనా, ఇండియా మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దాంతో ఇరు దేశాల రిలేషన్ విషయంలో భిన్నమైన సంకేతాలు తరచూ వెలువడుతూ వుంటాయి.

Telangana Politics: వరద పోయింది బురద మిగిలింది.. దాని ఆధారంగానే రాజకీయం రంజుగా మారుతోంది..

Telangana Politics: వరద పోయింది బురద మిగిలింది.. దాని ఆధారంగానే రాజకీయం రంజుగా మారుతోంది..

కాదేది కవితకు అనర్హం అన్నది పాత మాట.. కాదేదీ రాజకీయానికి అతీతం అన్నదిప్పటి మాట. సరిగ్గా అలాగే కొనసాగుతోంది తెలంగాణ రాజకీయమిపుడు.

Parliament Session: ఇప్పటి దాకా ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు.. ఆగస్టు తొలివారంలో పార్లమెంటు సెషన్ మరింత హాట్‌హాట్

Parliament Session: ఇప్పటి దాకా ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు.. ఆగస్టు తొలివారంలో పార్లమెంటు సెషన్ మరింత హాట్‌హాట్

ఇక తొలి పది రోజుల వర్షాకాల సమావేశాలతో పోల్చుకుంటే ఆగస్టు తొలి వారంలో పార్లమెంటు మరింతగా దద్దరిల్లబోయే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం సభలో పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉన్నా తాము అనుకున్న 13 బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి మోదీ సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ 13 బిల్లులతో పాటు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై కూడా ఆగస్టు తొలి వారంలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైతే అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేము.

No-Confidence Motion: అత్యధికంగా ఇందిరపై అవిశ్వాసాలు.. మోదీపై ఇది రెండోది.. ఒక్కసారి నెగ్గని అవిశ్వాస తీర్మానం

No-Confidence Motion: అత్యధికంగా ఇందిరపై అవిశ్వాసాలు.. మోదీపై ఇది రెండోది.. ఒక్కసారి నెగ్గని అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానంపై మాట్లాడే ఎంపీలు.. అన్ని రకాల అంశాలను ప్రస్తావించవచ్చు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో లోక్‌సభ సమావేశాలు రసవత్తరంగా మారడం మాత్రం ఖాయం.

Rain Effect: అగ్ర నేతల రాకకు వర్షం ఎఫెక్ట్.. అమిత్ షా, ప్రియాంక పర్యటనలు వాయిదా.. నిరాశలో రెండు పార్టీలు

Rain Effect: అగ్ర నేతల రాకకు వర్షం ఎఫెక్ట్.. అమిత్ షా, ప్రియాంక పర్యటనలు వాయిదా.. నిరాశలో రెండు పార్టీలు

వ్యూహప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని ఉత్సాహ పడుతున్న తెలంగాణ రాజకీయ పార్టీల వేగానికి భారీ వర్షాలు కల్లెం వేశాయి.