Bank Charges : అమ్మ బాబోయ్..! మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో ఇన్ని డబ్బులు వసూలు చేశారా.?

|

Aug 14, 2023 | 9:29 AM

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీసం ఇంత మొత్తం పెట్టాలని ఒక్కో బ్యాంకు ఒక్కోలా నిర్ణయిస్తాయి. అలా కనీస బ్యాలెన్స్ ఉంచకుంటే చార్జీలు బాదుతాయి. నెలనెలా అకౌంట్‌లో నుంచి కట్ చేసుకుంటాయి. వీటితోపాటు ఏటీఎం లావాదేవీ చార్జీలు, ఎస్సెమ్మెస్ చార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన డబ్బు గురించిన వివరాలను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలిపారు.

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీసం ఇంత మొత్తం పెట్టాలని ఒక్కో బ్యాంకు ఒక్కోలా నిర్ణయిస్తాయి. అలా కనీస బ్యాలెన్స్ ఉంచకుంటే చార్జీలు బాదుతాయి. నెలనెలా అకౌంట్‌లో నుంచి కట్ చేసుకుంటాయి. వీటితోపాటు ఏటీఎం లావాదేవీ చార్జీలు, ఎస్సెమ్మెస్ చార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన డబ్బు గురించిన వివరాలను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్ము ఏకంగా 35 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలిపింది. అది కూడా 2018 నుంచి ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తమేనని చెప్పింది. ఇందులో 21 వేల కోట్ల రూపాయలు.. కేవలం కనీస బ్యాలెన్స్ లేదన్న కారణంతోనే విధించినట్లు వెల్లడించింది. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు సంస్థలైన యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఉంచలేదన్న కారణంతో 21 వేల కోట్ల రూపాయలను కట్ చేసుకున్నాయని వెల్లడించారు. ఏటీఎం లావాదేవీల కోసం 8 వేల కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు 6 వేల కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us on