Team India Asia Cup 2023: టీమిండియా ఒక వారం తర్వాత శ్రీలంకలో ఆసియా కప్ 2023 వంటి కీలక టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. 2023 ఆసియా కప్నకు ముందు భారత క్రికెట్ జట్టుకు శుభవార్త వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్లో ఆ జట్టులోని ఓ స్టార్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక నివేదిక ప్రకారం ఈ ఆటగాడు నేషనల్ క్రికెట్ అకాడమీలో 199 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీకి భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. గాయం కారణంగా అతను గత చాలాసార్లు భారత జట్టులో లేరు. ఒక నివేదిక ప్రకారం, అయ్యర్ నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రాక్టీస్ మ్యాచ్లో 199 పరుగులు చేశాడు. 50 ఓవర్లకు కూడా ఫీల్డింగ్ చేశాడు.
శ్రేయాస్ అయ్యర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో అతను ట్రైనర్ రజనీకాంత్ శివజ్ఞానం, మెడికల్ చీఫ్ నితిన్ పటేల్తో కలిసి కనిపిస్తున్నాడు. ఈ ఫొటోను పంచుకుంటూ క్యాప్షన్లో ‘ఇది సుదీర్ఘ ప్రయాణం. కానీ, ఈ ప్రయాణంలో నాతో పాటు ఉండి నాకు సహాయం చేసిన వారందరికీ నేను కృతజ్ఞుడను. నితిన్ భాయ్, రజనీ సర్, నేషనల్ క్రికెట్ అకాడమీ సిబ్బందికి ధన్యవాదాలు. దీనితో పాటు బయటి వారికి కూడా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు.
శ్రేయాస్ అయ్యర్ ఇప్పటి వరకు టీమిండియా తరుపున మొత్తం 10 టెస్టులు, 42 వన్డేలు, 49 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్లు జరిగాయి. ఈ సిరీస్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ తన వెన్నుముకలో వాపు ఉందని ఫిర్యాదు చేశాడు . జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత, ఏప్రిల్లో అయ్యర్కి బ్రిటన్లో విజయవంతమైన వెన్ను శస్త్రచికిత్స జరిగింది. అతను గత 2 నెలలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..