న్యూఢిల్లీ, ఆగస్టు 20: వివిధ పరీక్షలకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా ఎస్ఎస్సీ నియామక పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఎస్ఎస్సీ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కమిషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత ఎంపిక జాబితా ఆగస్టు 19న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు క్యాంపస్లలో ఆగస్టు 23, 27 తేదీల్లో నూజివీడు ట్రిపుల్ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. మూడో దఫా కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవల్సిందిగా ఆర్జీయూకేటీ సూచించింది.
ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలకు సంబంధించిన ప్రకటన కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.