టీడీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు దేవినేని అవినాష్ కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్ని జాకీలు పెట్టినా ఇక టీడీపీ లేవదన్నారు. నారా లోకేష్ పాదయాత్రను ఈవినింగ్ వాక్గా ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. విజయవాడలో లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. కాల్ మనీ కేసుల్లో ఉన్న భపూన్ గాల్లు తన గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రూపాయి బిళ్లకు పనికిరాని చిల్లర గాళ్లు మమల్ని విమర్శిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనను బలిపశువును చేసింది టిడిపియేని ఆరోపించిన ఆయన.. అది అందరికీ తెలుసన్నారు. తనను సీఎం జగన్ అన్ని రకాలుగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని దేవినేని అవినాష్ చెప్పారు.