Sushant Singh Rajput: సుశాంత్ జీవితంపై ఎవరు సినిమా తీయకూడదు.. హైకోర్టును ఆశ్రయించిన హీరో తండ్రి..

|

Aug 18, 2023 | 5:48 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ 'న్యాయ్: ది జస్టిస్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కావడాన్ని ఇప్పటికే ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపాలని సుశాంత్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆ చిత్రాన్ని నిషేధించడానికి నిరాకరించింది కోర్టు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుశాంత్ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి న్యాయవాది వరుణ్ సింగ్ కోర్టులో వాదించారు, ఈ చిత్రం నటుడి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా,

Sushant Singh Rajput: సుశాంత్ జీవితంపై ఎవరు సినిమా తీయకూడదు.. హైకోర్టును ఆశ్రయించిన హీరో తండ్రి..
Sushant Singh Rajput
Follow us on

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. సుశాంత్ మరణించి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అతని మరణంపై అనేక అనుమానాలున్నాయి. సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతుండగా..మరోవైపు తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని అతని తండ్రి న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే సుశాంత్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘ఆన్‌లైన్ స్ట్రీమింగ్’పై స్టే ఇవ్వాలని సుశాంత్ తండ్రి కోరారు. అయితే స్ట్రీమింగ్ చేయకుండా ఉండడం కుదరదని వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆయన తండ్రి గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ కిషోర్ సింగ్ అప్పీల్‌పై జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ ధర్మేష్ శర్మలతో కూడిన ధర్మాసనం సినీ నిర్మాతలతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. తన కుమారుడి జీవితంపై సినిమా తీయడం ద్వారా ‘అన్యాయమైన వాణిజ్య ప్రయోజనం’ పొందారని సుశాంత్ తండ్రి ఆరోపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ ‘న్యాయ్: ది జస్టిస్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కావడాన్ని ఇప్పటికే ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపాలని సుశాంత్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆ చిత్రాన్ని నిషేధించడానికి నిరాకరించింది కోర్టు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుశాంత్ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి న్యాయవాది వరుణ్ సింగ్ కోర్టులో వాదించారు, ఈ చిత్రం నటుడి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, కుటుంబ సభ్యుల గోప్యతను కూడా ఉల్లంఘిస్తుందని, దానిని తాము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. మరోవైపు చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణించిన తర్వాత గోప్యత హక్కును క్లెయిమ్ చేయలేమని అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి ఇన్ స్టా పోస్ట్..

ఈ విషయం సబ్ జ్యూడీస్‌గా ఉందని, అప్పీల్‌పై ప్రతి ఒక్కరూ తమ సమాధానాన్ని దాఖలు చేయాలని కోర్టు కోరింది. సుశాంత్‌పై చాలా మంది అనుమతిలేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పుస్తకాలు రాస్తున్నారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఇలా చేయడం వలన తన కుమారుడి పరువు, అతని ప్రైవసీ, హక్కులకు విరుద్ధమని సుశాంత్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

సుశాంత్ సోదరి ఇన్ స్టా పోస్ట్..

గత నెలలో సింగిల్ జడ్జి సుశాంత్ తండ్రి దరఖాస్తును తిరస్కరించారు. ‘న్యాయ్: ది జస్టిస్’ సినిమా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో వస్తోందని ఆయన పేర్కొన్నారు. కానీ ఇది తన కుమారుని ‘వ్యక్తిత్వ హక్కులను’ ఉల్లంఘిస్తుందని ఆరోపించగా.. ఈ హక్కులు మనిషి మరణించిన తర్వాత ముగుస్తాయని కోర్టు సుశాంత్ తండ్రి ఆరోపణలను ఖండించింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయేనాటికి సుశాంత్ వయసు 34 ఏళ్లు. సుశాంత్ మరణంపై అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని.. అతడిని హత్య చేశారంటూ ఆరోపించారు సుశాంత్ కుటుంబసభ్యులు. దీంతో సుశాంత్ సూసైడ్ పై ఇప్పటికీ మిస్టరీగా ఉండిపోయింది.

సుశాంత్ సోదరి ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.