డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లు.. భారత్ నుంచి ఒక్కరే..!

ఇంగ్లాండ్ తరఫున 46 టెస్టులు ఆడిన జో రూట్ 12 సెంచరీలు చేసి డబ్ల్యూటీసీ సెంచరీల లిస్టు అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషెన్ ఈ లిస్టు రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఆసీస్ తరఫున 37 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు చేశాడు.

ఆసీస్ టెస్ట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ 37 మ్యాచ్‌ల్లో 9 సెంచరీలు చేసి.. ఈ లిస్టు మూడో స్థానంలో ఉన్నాడు.

పాక్ కెప్టెన్ బాబర్ అజాం 25 మ్యాచ్‌ల్లో 9 సెంచరీలు చేయడం ద్వారా నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ 5 లిస్టులో రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 24 టెస్టులు ఆడి 7 సెంచరీలు చేశాడు.  భారత్ తరఫున రోహిత్ మాత్రమే టాప్ 5లో ఉన్నాడు.