ఇంగ్లండ్‌లో మెరిసిన స్మృతి మంధాన.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ..

5 August 2023

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంది. 

అక్కడ జరుగుతోన్న ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఆడుతోంది. 

ది హండ్రెడ్ టోర్నీలో పరుగుల వర్షం కురిపిస్తోంది.

స్మృతి మంధాన ది హండ్రెడ్ ఉమెన్ టోర్నమెంట్‌లో సదరన్ బ్రేవ్‌లో భాగంగా ఉంది. 

ఆమె గత సీజన్‌లో కూడా ఇదే ఫ్రాంచైజీ తరపున ఆడింది.

ఈ సీజన్‌లో మంధాన వరుసగా రెండో అర్ధ సెంచరీని నమోదు చేసింది. 

స్మృతి కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసింది. 

భీకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆమె జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

వెస్టిండీస్ ఆల్-రౌండర్ హేలీ మాథ్యూస్ వెల్ష్ ఫైర్ ఈ విజయంలో స్టార్‌గా నిలిచింది. 

ఆమె 65 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్, ఒక రన్ అవుట్ చేసింది.