భారత మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 100 కి.మీ

ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ లెక్ట్రిక్స్‌ ఈవీ దేశీయ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ3.0, ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ2.0 పేరుతో ఈ-స్కూటర్లను పరిచయం చేసింది

వీటి ప్రారంభ ధర రూ.1.03 లక్షలు. 2.3 కిలోవాట్స్‌, 3 కిలోవాట్స్‌ బ్యాటరీ సామర్థ్యంతో స్కూటర్లు

ఈ స్కూటర్లకు ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్లకుపైగా వెళ్లగలవని కంపెనీ వెల్లడి

ఈ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా మొత్తం100కుపైగా డీలర్‌షిప్‌లు

వచ్చే నెల 16 నుంచి స్కూటర్ల డెలివరీలు మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది

ఎమర్జన్సీ ఎస్‌వోఎస్‌ అలర్ట్‌, నావిగేషన్‌ అసిస్ట్‌, ఓవర్‌-ది-ఎయిర్‌ అప్‌డేట్స్‌ తదితర 12 అగ్రశ్రేణి ఫీచర్లతో పాటు మొత్తం 93 ఫీచర్లు

ఈ కంపెనీకి ఏటా 1.5 లక్షల యూనిట్లను తయారుచేసే ప్లాంట్‌ హర్యానాలోని మనేసర్‌లో నెలకొల్పింది